Connect with us

Andhrapradesh

సాగు నీరుకై 30 గంటల నిరవదిక దీక్ష ప్రారంభించిన రైతు జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రామకృష్ణ.

Published

on

193 Views

హంద్రి నీవా కు గుండ్లకొండ దగ్గర స్లూయిజ్ ఏర్పాటు చేసి కోటకొండ వరకు సాగునీరు ఇవ్వాలి.

హంద్రీనీవా ద్వారా మండలంలోని చెరువులకు నీళ్లు నింపాలి.

గుండ్లకొండ దగ్గర హంద్రీనీవాకు స్లుయిజ్ ఏర్పాటు చేసి కోటకొండ ,మాచాపురం గ్రామాల వరకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అదే విధంగా మండలం లోని చెరువులన్నింటికీ హంద్రీనీవా ద్వారా నీళ్లు మళ్లించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేవనకొండ మండల కేంద్రంలో 30 గంటల నిరవధిక దీక్షను రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ ప్రారంభించారు.

బుధవారం స్థానిక పాత తాసిల్దార్ కార్యాలయం ఎదురుగా 30 గంటలు నిరవధిక దీక్షను ప్రారంభించారు, రైతు సంఘం మండల కార్యదర్శి సూరి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రైతు సంఘం  జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వీరశేఖర్ లు మాట్లాడుతూ నిత్యం  కరువుతో అల్లాడుతున్న దేవనకొండ మండలం లో సాగునీటికి అనేక అవకాశాలు ఉన్నాయని కానీ పాలకుల చిత్తశుద్ధి లోపం బాధ్యతారహిత్యం ప్రజల పట్ల,ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి లేకపోవడం వలన మండల ప్రజానీకం నిత్యం కరువుకాటకల అల్లాడుతున్నారని విమర్శించారు. 

కరువు నుండి శాశ్వతంగా విముక్తి  చేసే అవకాశం ఉందని మండలం లోని పై తట్టు గ్రామాలైన గుండ్లకొండ, గుడిమరాళ్ల,బంటుపల్లి, బేతపల్లి, చేలీమ చలిమిల,బండపల్లి, కోటకొండ, వెంకటాపురం, పల్లె దొడ్డి, బురకుంట, మాచాపురం గ్రామాలకు  సాగునీరు కోసం గుండ్లకొండ దగ్గర ఏర్పాటు చేస్తే గ్రావిటీ కింద 20 వేల  ఎకరాలకు సాగునీరు ఇచ్చే అవకాశం ఉందని అదే విధంగా గుండ్లకొండ బానకుంట, గుడిమిరాళ్ళ నెమళ్ళ బండ, తుమ్మలచెరువు, బంటుపల్లి చెరువు,  బండపల్లి చెరువు, కోటకొండ చిన్నోని చెరువు మాచాపురం పెద్ద చెరువు, నేలతల మరి చెరువు, బుర్రకుంట గ్రామాల చెరువులకు హంద్రీనీవా ద్వారానీళ్లు మళ్లించవచ్చని   వారు తెలిపారు. 

అధికారం కోసం అనేక హామీలు చేసిన నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలు మరిచిపోయి ఏమీ తెలియనట్టు నటిస్తున్నారని ,ఏటా కరువుతో రైతులు, రైతాంగం తీవ్ర ఇబ్బందులు గురవుతుందని ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతూ ప్రకృతి నిరాధారణ గురి చేస్తూ రైతుల జీవితాలతో ఆడుకుంటున్నాయని పేర్కొన్నారు మండలంలో ప్రతి ఎకరాకు నీరు ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో  ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు హంద్రీ నీవా కు గుండ్ల కొండ దగ్గర స్లుయిజ్ ఏర్పాటు చేయాలని అదేవిధంగా దేవనకొండ మండలంలోని చెరువుల నీటికి హంద్రీ నీవా ద్వారా నీళ్లు మళ్లించాలని డిమాండ్ చేశారు అదేవిధంగా రెండు సంవత్సరాల కరువు నేపథ్యంలో మండలంలో ఆత్మహత్యలు పెరుగుతున్నాయని మండలంలో జరిగే ప్రతిరైతు ఆత్మహత్య ప్రభుత్వ హత్యనే నని పేర్కొన్నారు. 

హంద్రీనీవా నుండి స్లుయిజ్ ఏర్పాటు చేసి పై త ట్టు గ్రామాలకు సాగును ఇచ్చేవరకు మండలం లోని ప్రతి చెరువుకు నీళ్లు మళ్లించే వరకు రైతు,వ్యవసాయ కార్మిక సంఘాలు పోరాటాలు చేస్తాయని, ఉద్యమాన్ని దశలవారీగా ఉధృతం చేస్తామని పేర్కొన్నారు ప్రజలతో, రైతుల మద్దతు తో ప్రభుత్వ కార్యాల కార్యాలయం దిగ్బంధన కార్యక్రమం కూడా చేపడతామని జరగబోయే ఉద్యమాలకు ప్రభుత్వందే బాధ్యతని పేర్కొన్నారు 

ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి అశోక్, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి మహబూబ్బాషా, సీనియర్ నాయకులు బజారి ,యువజన సంఘం నాయకులు శ్రీనివాసులు రైతు సంఘం నాయకులు సుంకన్న సుధాకర్ మార్కండేయులు దీక్షలో కూర్చున్నారు అదేవిధంగా ప్రజాసంఘాల నాయకులు యూసుఫ్ బాషా, రాయుడు, మహేంద్ర ,సింహాద్రి ,పాండు, నాగేంద్ర రమేష్, నాగేష్ లతోపాటుగా బండపల్లి గుడిమరాళ్ల ,గుండ్లకొండ రైతులు కృష్ణ, కౌలుట్ల ,ఓబయ్య బజారి తదితరులు పాల్గొన్నారు.

Andhrapradesh

గిట్టుబాటు ధర హామీ అమలు చేయకపోతే, ఉద్యమాలతో ప్రభుత్వాన్ని కుదిపేస్తాం!

Published

on

153 Views

రైతులకు గిట్టుబాటు ధరల హామీ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి! డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫారసులు కాగితాల్లో మాత్రమే మిగిలిపోవాలి కాదు, అమలులోకి రావాలి! జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి!

రైతులు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. రాష్ట్రంలో 200 రకాలకుపైగా పంటలు పండితే, కేవలం 20-25 పంటలకే మద్దతు ధర ప్రకటించడం కక్ష సాధింపు చర్య కాదు అంటే ఏమిటి? అదీ కూడా మార్కెట్‌లో ధరలు పెరిగినప్పుడే ప్రభుత్వం రైతులకు మద్దతు ధర ఇచ్చినట్లు నటిస్తోంది. ప్రస్తుతం ఏ గ్రేడ్ మిర్చి ధర ₹17,000 ఉండగా, ప్రభుత్వం ₹11,700 ఇస్తున్నామని చెప్పుకోవడం హాస్యాస్పదం. ఒకరికి రూ. 5,000 కట్ చేసి మరొకరికి వేల కోట్లు మాఫీ చేయడమేనా పాలన?

రైతుల పేరిట ఓట్లు వేయించుకుని, అధికారంలోకి వచ్చాక రైతులను పక్కన పెట్టే ప్రభుత్వాలను భరించేది లేదు! ఏపీ అంటే కేవలం అమరావతి, పోలవరమే కాదు. రైతుల శ్రమ, కష్టం, కన్నీళ్ల మీద నిర్మించుకున్న భవనాలే కాదా? మద్దతు ధర ఇవ్వకపోతే వ్యవసాయమే క్షీణించిపోతుంది. నకిలీ విత్తనాలు, పురుగు మందులతో రైతులను మోసం చేసే ముఠాలను అరికట్టాల్సింది పోయి, రైతుల్ని రెక్కల ముక్కలు చేసేందుకు కుట్రలు చేస్తున్నారా?

రైతు సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోతే, రాష్ట్రవ్యాప్తంగా రైతులెవరూ క్షమించరు! ప్రభుత్వం గట్టిగా స్పందించకపోతే, రైతు చైతన్య యాత్రలు చేస్తాం, పోరాటాలు మిన్నంటిస్తాం! రైతు సంఘం దీక్షలు, ఉద్యమాలు ఎంత దూరమైనా వెళ్లే వరకు వెనక్కి తగ్గేది లేదు. ఈ కార్యక్రమంలో సీపీఐ రైతు సంఘం నాయకులు కృష్ణ, రవికుమార్, అనుమప్ప, కోదండ, మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.

 

 

4o

Continue Reading

Andhrapradesh

ఆలూరు నియోజకవర్గ అభివృద్ధికి… సహాయ సహకారాలు అందించండి.

Published

on

కలెక్టరు రంజిత్ బాషాను కలిసిన వీరభద్ర గౌడ
281 Views

కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ భాషాను, ఆలూరు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి వీరభద్ర గౌడ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాకి వెనుకబడిన ఆలూరు నియోజవర్గంలో వేదావతి మరియు నాగరడోన రిజర్వాయర్ మరియు సాగు, మరియు తాగు నీరు సమస్యలు, రోడ్లు, నియోజకవర్గంలో వలసలు వంటి పలు సమస్యల గురించి వివరించడం జరిగింది..

Continue Reading

Andhrapradesh

పెద్దహ్యట గ్రామంలో ఆదికవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు..

Published

on

271 Views

హోళగుంద మండలం పెద్దహ్యట గ్రామంలో రామాయణ సృష్టికర్త ఆది కవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా పెద్దహ్యట బోయ కాలనీలో శ్రీ.వాల్మీకి మహర్షి నూతన బోర్డును ఏర్పాటు చేసి శ్రీ.వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలు వేసి ప్రత్యేక పూజలు వేసి ఆదికవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది.

అదేవిధంగా మండల ప్రాథమిక పాఠశాలలో కూడా జిల్లా ఉన్నంత విద్య అధికారుల ఆదేశాల మేరకు ఆదికవి శ్రీ వాల్మీకి మహర్షి జయంతిని విద్యార్థులు ఉపాధ్యాయులు వాల్మీకి పెద్దలు యువకులు ఆధ్వర్యంలో శ్రీ వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలు వేసి పూజలు చేసి జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా వాల్మీకి పెద్దలు వాల్మీకి యువకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రామాయణ సృష్టికర్త శ్రీ.ఆదికవి వాల్మీకి మహర్షి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయం అని వారన్నారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ ప్రవేట్ విద్యాసంస్థలలో కూడా శ్రీ వాల్మీకి మహర్షి జయంతి ఘనంగా నిర్వహించాలని జిల్లా ఉన్నంత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం చాలా గర్వించద విషయం అని అన్నారు అదేవిధంగా బోయ వాల్మీకుల చిరకాల కోరిక బోయలను ఎస్టీ రిజర్వేషన్ కోసం స్వాతంత్రం వచ్చినప్పుడు నుండి పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు కాబట్టి ఇప్పుడైనా కూటమి ప్రభుత్వంలో బోయ వాల్మీకులను గుర్తించి ఎస్టీ రిజర్వేషన్ కల్పించాల్సిందిగా వారు కోరారు.

ఈ కార్యక్రమంలో వాల్మీకి పెద్దలు పులికొండ రంగస్వామి పులి వీరభద్ర బెలగల్ నాగరాజ్ కట్టే తిమ్మయ్య కట్టే నాగప్ప పాండురంగ తోట మారెప్ప వాల్మీకి యువకులు శ్రీరంగ తలారి మల్లయ్య బుల్లయ్య గారి రాము గిర్రప్ప గారి నాగరాజ్ పులి మల్లయ్య నాగప్ప గోపాల్ వీరేష్ మల్లి అనిమేష్ తిరుపతి నాగేంద్ర వెంకటేష్ కృష్ణ మల్లికార్జున రాజు శివప్ప నాగేష్ ఎర్రి స్వామి ఎర్రప్ప సుంకయ్య సేకయ్య గణేష్ మహేష్ భీమేష్ హరి అశోక్ కుమార్ వాల్మీకి కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

Trending

Home
Ap News
Login
Reporters