Connect with us

Andhrapradesh

జగన్ సర్కారు పై మండిపడిన టిడిపి నేతలు – ఏ మొహం పెట్టుకొని బస్సు యాత్ర చేస్తున్నారు.

Published

on

223 Views

చంద్రబాబు సర్కారు తెచ్చిన పథకాలను రద్దు చేయడం అన్యాయం.

సామాజిక న్యాయం పేరుతో మరోసారి మోసం చేయడానికి కుట్ర.


సామాజిక న్యాయం పేరుతో బస్సు యాత్ర చేపట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను మరోసారి మోసం చేయడానికి జగన్ సర్కారు కుట్ర పన్నిందని, మోసపోయే స్థితిలో ఈ రాష్ట్ర ప్రజలు లేరని టిడిపి నేతలు పేర్కొన్నారు.


మాజీ కేంద్రమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు కోట్ల జయ జయ సూర్య ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు గురువారం స్థానిక కోట్ల క్యాంపు కార్యాలయం నందు టిడిపి నేతలు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.చంద్రబాబు నాయుడు తన హాయంలో తెచ్చిన 27 దళిత సంక్షేమ పథకాలను రద్దు చేయడమే కాకుండా, 50వేల బ్యాక్ లక్ పోస్టులను భర్తీ చేయలేదన్నారు, 15 దళిత నియోజకవర్గాల మధ్య ఉన్న అమరావతిలో దళిత రాజధానిని నీరుగార్చారని మండిపడ్డారు.


ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు లబ్ధి చేకూరే విదేశీ విద్య, విద్యోన్నతి, బెస్ట్ అవైలబుల్స్ స్కూళ్లు, కళ్యాణ కానుక, కులాంతర వివాహాల ప్రోత్సాహకాలను రద్దు చేసిన ఘనుడు జగన్ అని పేర్కొన్నారు, చంద్రబాబు నాయుడు తన హాయంలో స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లను 34 శాతం అమలు చేస్తే దానిని 24% కుదించి 16,800 మంది బీసీ లను స్థానిక సంస్థలలో అధికారానికి దూరం చేశారని ఆవేదన చెందారు.9224 మందికి చంద్రబాబు నాయుడు సివిల్ కోచింగ్ ఇస్తే దానిని జగన్ రద్దుచేసి బీసీలను ప్రభుత్వ ఉద్యోగాలు రాకుండా కుట్ర పన్నాడని మండిపడ్డారు.
టీటీడీ, ఏపీఐసీసీ, చూడావంటే కీలక పదవులు బీసీలకు చంద్రబాబు కట్టబెడితే జగన్ మాత్రం బీసీలను రాజకీయంగా అనగదొక్కేలా కుర్చీ లేని ఖర్చు లేని, నిధులు గదులు విధులు లేని కార్పొరేషన్ పదవులు కట్టబడ్డారని పేర్కొన్నారు. ముస్లిం ఓట్లతో అధిక సీట్లు సాధించిన జగన్ ఇస్లామిక్ బ్యాంకు తెస్తానని హామీ ఇచ్చి నేడు ఆ ఊసే ఎత్తకుండా ముస్లిం పేదలకు ఉపయోగపడే దుల్హన్ పథకానికి మంగళం పాడారని దుయ్యపడ్డారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలపై దమనకాండ కు పాల్పడిన జగన్ సర్కారు ఎన్నికలు సమీపిస్తుండడంతో సామాజిక న్యాయ బస్సు యాత్ర అంటూ జోల పాట పాడుతున్నారని ఎన్ని యాత్రలు చేపట్టిన, ఎన్ని కుట్రలకు పాల్పడిన జగను నమ్మే స్థితిలో రాష్ట్ర ప్రజలు లేరని ఎన్నికలు ఎప్పుడు వచ్చిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం తధ్యమని తెలిపారు.


నిజం గెలవాలి అని చంద్రబాబు అక్రమ అరెస్టుకు ఆగిన గుండెలు కుటుంబాలను ఓదార్చడానికి చేపట్టిన భువనేశ్వరి యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు.
ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కదిరికోట ఆదెన్న, మాజీ జిల్లా వక్ఫ్ బోర్డు డైరెక్టర్ జి. అల్తాఫ్, ఆం.ప్ర.రాష్ట్ర సగర ( ఉప్పర) ఫెడరేషన్ మాజీ డైరెక్టర్ ఉప్పర ఆంజనేయులు, మాజీ ఆత్మ చైర్మన్ కందనాతి శ్రీనివాసులు, నందవరం మండలం టిడిపి నాయకులు టిడిపి ముగతి వీరారెడ్డి, ఎమ్మిగనూరు మండలం నాయకులు మాసు మాన్ దొడ్డి బోయ శ్రీనివాసులు, తెలుగు మహిళా నాయకురాలు గోకారమ్మ, టిడిపి ముస్లిం మైనార్టీ నాయకులు కె.యం.డి. అబ్దుల్ జబ్బర్, గోరా భాష, మేటి వల్లి భాష, ఆఫ్గాన్ వలిభాష, టిడిపి ఎస్సీ నాయకులు యస్. సాల్మన్, జాలవాడి ఏసన్న తదితరులు పాల్గొన్నారు.

Andhrapradesh

గిట్టుబాటు ధర హామీ అమలు చేయకపోతే, ఉద్యమాలతో ప్రభుత్వాన్ని కుదిపేస్తాం!

Published

on

153 Views

రైతులకు గిట్టుబాటు ధరల హామీ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి! డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫారసులు కాగితాల్లో మాత్రమే మిగిలిపోవాలి కాదు, అమలులోకి రావాలి! జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి!

రైతులు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. రాష్ట్రంలో 200 రకాలకుపైగా పంటలు పండితే, కేవలం 20-25 పంటలకే మద్దతు ధర ప్రకటించడం కక్ష సాధింపు చర్య కాదు అంటే ఏమిటి? అదీ కూడా మార్కెట్‌లో ధరలు పెరిగినప్పుడే ప్రభుత్వం రైతులకు మద్దతు ధర ఇచ్చినట్లు నటిస్తోంది. ప్రస్తుతం ఏ గ్రేడ్ మిర్చి ధర ₹17,000 ఉండగా, ప్రభుత్వం ₹11,700 ఇస్తున్నామని చెప్పుకోవడం హాస్యాస్పదం. ఒకరికి రూ. 5,000 కట్ చేసి మరొకరికి వేల కోట్లు మాఫీ చేయడమేనా పాలన?

రైతుల పేరిట ఓట్లు వేయించుకుని, అధికారంలోకి వచ్చాక రైతులను పక్కన పెట్టే ప్రభుత్వాలను భరించేది లేదు! ఏపీ అంటే కేవలం అమరావతి, పోలవరమే కాదు. రైతుల శ్రమ, కష్టం, కన్నీళ్ల మీద నిర్మించుకున్న భవనాలే కాదా? మద్దతు ధర ఇవ్వకపోతే వ్యవసాయమే క్షీణించిపోతుంది. నకిలీ విత్తనాలు, పురుగు మందులతో రైతులను మోసం చేసే ముఠాలను అరికట్టాల్సింది పోయి, రైతుల్ని రెక్కల ముక్కలు చేసేందుకు కుట్రలు చేస్తున్నారా?

రైతు సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోతే, రాష్ట్రవ్యాప్తంగా రైతులెవరూ క్షమించరు! ప్రభుత్వం గట్టిగా స్పందించకపోతే, రైతు చైతన్య యాత్రలు చేస్తాం, పోరాటాలు మిన్నంటిస్తాం! రైతు సంఘం దీక్షలు, ఉద్యమాలు ఎంత దూరమైనా వెళ్లే వరకు వెనక్కి తగ్గేది లేదు. ఈ కార్యక్రమంలో సీపీఐ రైతు సంఘం నాయకులు కృష్ణ, రవికుమార్, అనుమప్ప, కోదండ, మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.

 

 

4o

Continue Reading

Andhrapradesh

ఆలూరు నియోజకవర్గ అభివృద్ధికి… సహాయ సహకారాలు అందించండి.

Published

on

కలెక్టరు రంజిత్ బాషాను కలిసిన వీరభద్ర గౌడ
281 Views

కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ భాషాను, ఆలూరు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి వీరభద్ర గౌడ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాకి వెనుకబడిన ఆలూరు నియోజవర్గంలో వేదావతి మరియు నాగరడోన రిజర్వాయర్ మరియు సాగు, మరియు తాగు నీరు సమస్యలు, రోడ్లు, నియోజకవర్గంలో వలసలు వంటి పలు సమస్యల గురించి వివరించడం జరిగింది..

Continue Reading

Andhrapradesh

పెద్దహ్యట గ్రామంలో ఆదికవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు..

Published

on

271 Views

హోళగుంద మండలం పెద్దహ్యట గ్రామంలో రామాయణ సృష్టికర్త ఆది కవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా పెద్దహ్యట బోయ కాలనీలో శ్రీ.వాల్మీకి మహర్షి నూతన బోర్డును ఏర్పాటు చేసి శ్రీ.వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలు వేసి ప్రత్యేక పూజలు వేసి ఆదికవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది.

అదేవిధంగా మండల ప్రాథమిక పాఠశాలలో కూడా జిల్లా ఉన్నంత విద్య అధికారుల ఆదేశాల మేరకు ఆదికవి శ్రీ వాల్మీకి మహర్షి జయంతిని విద్యార్థులు ఉపాధ్యాయులు వాల్మీకి పెద్దలు యువకులు ఆధ్వర్యంలో శ్రీ వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలు వేసి పూజలు చేసి జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా వాల్మీకి పెద్దలు వాల్మీకి యువకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రామాయణ సృష్టికర్త శ్రీ.ఆదికవి వాల్మీకి మహర్షి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయం అని వారన్నారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ ప్రవేట్ విద్యాసంస్థలలో కూడా శ్రీ వాల్మీకి మహర్షి జయంతి ఘనంగా నిర్వహించాలని జిల్లా ఉన్నంత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం చాలా గర్వించద విషయం అని అన్నారు అదేవిధంగా బోయ వాల్మీకుల చిరకాల కోరిక బోయలను ఎస్టీ రిజర్వేషన్ కోసం స్వాతంత్రం వచ్చినప్పుడు నుండి పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు కాబట్టి ఇప్పుడైనా కూటమి ప్రభుత్వంలో బోయ వాల్మీకులను గుర్తించి ఎస్టీ రిజర్వేషన్ కల్పించాల్సిందిగా వారు కోరారు.

ఈ కార్యక్రమంలో వాల్మీకి పెద్దలు పులికొండ రంగస్వామి పులి వీరభద్ర బెలగల్ నాగరాజ్ కట్టే తిమ్మయ్య కట్టే నాగప్ప పాండురంగ తోట మారెప్ప వాల్మీకి యువకులు శ్రీరంగ తలారి మల్లయ్య బుల్లయ్య గారి రాము గిర్రప్ప గారి నాగరాజ్ పులి మల్లయ్య నాగప్ప గోపాల్ వీరేష్ మల్లి అనిమేష్ తిరుపతి నాగేంద్ర వెంకటేష్ కృష్ణ మల్లికార్జున రాజు శివప్ప నాగేష్ ఎర్రి స్వామి ఎర్రప్ప సుంకయ్య సేకయ్య గణేష్ మహేష్ భీమేష్ హరి అశోక్ కుమార్ వాల్మీకి కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

Trending

Home
Ap News
Login
Reporters