Andhrapradesh
నవంబర్ 8 న జరిగే విద్యాసంస్థల బంద్ ను జయప్రదం చేయండి.

ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్.శరత్ కుమార్.
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను ఉపసంహా రించుకోవాలని, కడప ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో నవంబర్ 8 వ తేదీన జరిగే కేజీ నుండి పీజీ వరకు విద్యాసంస్థల బంద్ ను జయప్రదం చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్. శరత్ కుమార్ పిలుపునిచ్చారు. శనివారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గోడ పత్రికలను విడుదల చేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణకు పూనుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 32 మంది ఆంధ్రుల ప్రాణ త్యాగాలతో నిర్మించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమను కారుచౌకగా కార్పొరేట్లకు అమ్మేస్తూ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు.
లాభాల్లో నడుస్తున్న పరిశ్రమను నష్టాల్లో చూపిస్తూ, ప్రైవేట్ పరం చేయడం సమంజసం కాదన్నారు.రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో నూతన పరిశ్రమలు ఏర్పాటు చేసి యువత కు ఉపాధి కల్పించడంలో ఘోరంగా విఫలం చెందారని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడంలో బాధ్యతారహితంగా వ్యవహరిస్తుందని అన్నారు. ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల, ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం బంద్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించి, మీ వైఖరి ని తెలియజేయాలని అన్నారు. రాష్ట్రంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేసి, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా ఎన్నో సంవత్సరంల పాటు శంకుస్థాపనలు చేస్తున్న కడప ఉక్కు పరిశ్రమ నిర్మించకపోవడం దారుణమన్నారు.
ఇదిగో పరిశ్రమ అదిగో పరిశ్రమని అంటూ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు అయితే రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం విభజన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని మరింత చీకటిలోకి నెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
నవంబర్ 8వ తేదీన జరిగే బంద్ లో అన్నీ రంగాల ప్రజలు, యువకులు, విద్యార్థులు ప్రత్యక్షంగా పాల్గోని,జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు రంగన్న, మండల అధ్యక్ష, కార్యదర్శులు మధు, భాస్కర్,నాయకులు సింహాద్రి, సురేంద్ర,కళాశాల విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.
Andhrapradesh
గిట్టుబాటు ధర హామీ అమలు చేయకపోతే, ఉద్యమాలతో ప్రభుత్వాన్ని కుదిపేస్తాం!

Andhrapradesh
ఆలూరు నియోజకవర్గ అభివృద్ధికి… సహాయ సహకారాలు అందించండి.

కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ భాషాను, ఆలూరు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి వీరభద్ర గౌడ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాకి వెనుకబడిన ఆలూరు నియోజవర్గంలో వేదావతి మరియు నాగరడోన రిజర్వాయర్ మరియు సాగు, మరియు తాగు నీరు సమస్యలు, రోడ్లు, నియోజకవర్గంలో వలసలు వంటి పలు సమస్యల గురించి వివరించడం జరిగింది..
Andhrapradesh
పెద్దహ్యట గ్రామంలో ఆదికవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు..

హోళగుంద మండలం పెద్దహ్యట గ్రామంలో రామాయణ సృష్టికర్త ఆది కవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా పెద్దహ్యట బోయ కాలనీలో శ్రీ.వాల్మీకి మహర్షి నూతన బోర్డును ఏర్పాటు చేసి శ్రీ.వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలు వేసి ప్రత్యేక పూజలు వేసి ఆదికవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది.
అదేవిధంగా మండల ప్రాథమిక పాఠశాలలో కూడా జిల్లా ఉన్నంత విద్య అధికారుల ఆదేశాల మేరకు ఆదికవి శ్రీ వాల్మీకి మహర్షి జయంతిని విద్యార్థులు ఉపాధ్యాయులు వాల్మీకి పెద్దలు యువకులు ఆధ్వర్యంలో శ్రీ వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలు వేసి పూజలు చేసి జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా వాల్మీకి పెద్దలు వాల్మీకి యువకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రామాయణ సృష్టికర్త శ్రీ.ఆదికవి వాల్మీకి మహర్షి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయం అని వారన్నారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ ప్రవేట్ విద్యాసంస్థలలో కూడా శ్రీ వాల్మీకి మహర్షి జయంతి ఘనంగా నిర్వహించాలని జిల్లా ఉన్నంత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం చాలా గర్వించద విషయం అని అన్నారు అదేవిధంగా బోయ వాల్మీకుల చిరకాల కోరిక బోయలను ఎస్టీ రిజర్వేషన్ కోసం స్వాతంత్రం వచ్చినప్పుడు నుండి పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు కాబట్టి ఇప్పుడైనా కూటమి ప్రభుత్వంలో బోయ వాల్మీకులను గుర్తించి ఎస్టీ రిజర్వేషన్ కల్పించాల్సిందిగా వారు కోరారు.
ఈ కార్యక్రమంలో వాల్మీకి పెద్దలు పులికొండ రంగస్వామి పులి వీరభద్ర బెలగల్ నాగరాజ్ కట్టే తిమ్మయ్య కట్టే నాగప్ప పాండురంగ తోట మారెప్ప వాల్మీకి యువకులు శ్రీరంగ తలారి మల్లయ్య బుల్లయ్య గారి రాము గిర్రప్ప గారి నాగరాజ్ పులి మల్లయ్య నాగప్ప గోపాల్ వీరేష్ మల్లి అనిమేష్ తిరుపతి నాగేంద్ర వెంకటేష్ కృష్ణ మల్లికార్జున రాజు శివప్ప నాగేష్ ఎర్రి స్వామి ఎర్రప్ప సుంకయ్య సేకయ్య గణేష్ మహేష్ భీమేష్ హరి అశోక్ కుమార్ వాల్మీకి కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు.
-
Andhrapradesh2 years ago
పాలస్తీనా పై ఇజ్రాయిల్ సాగిస్తున్న దురాక్రమణ దాడులను ఖండించండి!!
-
Andhrapradesh2 years ago
ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట భధ్రత … 1,500 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు. కర్నూలు జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్ ఐపియస్.
-
Andhrapradesh2 years ago
అసహనం లో SBI కస్టమర్స్.. నిలిచిన UPI సేవలు.
-
Andhrapradesh9 months ago
పెద్దహ్యట గ్రామంలో ఆదికవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు..
-
Andhrapradesh9 months ago
ఆలూరు నియోజకవర్గ అభివృద్ధికి… సహాయ సహకారాలు అందించండి.
-
Andhrapradesh2 years ago
సాంప్రదాయాన్ని పాటిస్తూ ,ఆచార వ్యవహారాలు కాపాడుకుందాం…
-
Andhrapradesh1 year ago
మండలంలోని సాగునీటి సమస్యలపై ప్రధాన రాజకీయ పార్టీలు తమ వైఖరి వెల్లడించాలి….సీపీఎం
-
Andhrapradesh1 year ago
ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించుకుందాం.