Andhrapradesh
మండల సమగ్ర అభివృద్ధికై తక్షణ చర్యలు చేపట్టండి.

విద్య వైద్యం ఉపాధి అవకాశాలపై దృష్టి సారించేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వండి.
జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో భాగంగా జిల్లా జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య గారికి సిపిఐ ప్రతినిధి బృందం వినతిపత్రం.
కర్నూలు జిల్లాలో అత్యంత వెనుకబడిన మండలం గా ఉన్న దేవనకొండ మండల సమగ్ర అభివృద్ధి పట్ల తక్షణ చర్యలు చేపట్టాలని సిపిఐ మండల ప్రధాన కార్యదర్శి ఎం. నరసారావు తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం మండల కేంద్రమైన దేవనకొండ లో చేపట్టిన జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమం లో భాగంగా జిల్లా జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య గారికి మండల సిపిఐ ప్రతినిధి బృందం వినతి పత్రం అందించి మండలంలోని పలు సమస్యలను జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండలంలో ప్రధాన సమస్యలు విద్యా, వైద్యం, ఉపాధి తదితర అంశాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. పాలకులు మారిన ప్రజల తలరాతలు నేటికీ మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చెంతనే హంద్రీ-నీవా నీరు ఉన్న చివరి ఆయకట్టు దాకా రైతాంగానికి సాగు కోసం నీరు అందించడానికి పిల్ల కాలువ నిర్మాణం నేటికి చేపట్టకపోవడం శోచనీయమన్నారు. ప్రస్తుత కరువు నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కరువు మండలంగా ప్రకటించినప్పటికీ రైతాంగాన్ని ఆదుకునేందుకు పటిష్టమైన కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పనులు లేక వలసలు వెళ్లే పరిస్థితి దాపురించిందన్నారు. వలసల నివారణకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తూ తగు చర్యలు చేపట్టాలన్నారు. అలాగే మండల కేంద్రంలో గల ప్రభుత్వ వైద్యశాలను 50 పడకల వైద్యశాలగా మార్పు చేసి రెగ్యులర్గా ఇద్దరు డాక్టర్లను, ఒక మహిళ డాక్టర్ను నియమించి, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు దేవనకొండ పిహెచ్సి లో జరిగే విధంగా ఆదేశాలు ఇవ్వాలన్నారు. అదేవిధంగా దేవనకొండ మండలం అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని మాదిరిగా దాపురించిందన్నారు. ఎందుకంటే ప్రభుత్వ స్థలాలు వేల ఎకరాలు ఉన్నా కూడా ప్రభుత్వ బాలుర వసతి గృహానికి మరియు మోడల్ స్కూల్ కు,యువతకు క్రీడా మైదానం కొరకు ప్రభుత్వ స్థలాలు కేటాయించలేక పోవడంతో మోడల్ స్కూల్ ఏర్పాటు కూడా వెనుకబడిపోవడానికి కారణంగా ఉందన్నారు. కావున ఎలక్షన్ల సమయంలోనే విద్యార్థులు యువకులు, ప్రజలు గుర్తుకు వచ్చే పాలకులకు పేద, బడుగు, బలహీన వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధితో పనిచేసేలా తగు చర్యలు చేపట్టాలన్నారు. కావున మండల ప్రజల సమస్యల పరిష్కారం పట్ల తక్షణ చర్యలు చేపట్టగలరని వారు జిల్లా జాయింట్ కలెక్టర్ గారిని కోరడం జరిగింది. ఈ సందర్భంగా తమరు మా దృష్టికి తీసుకు వచ్చిన పలు సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సీనియర్ నాయకులు గుడిమరాళ్ళ తిమ్మప్ప, భక్తతుకారం, నరసింహులు, సుల్తాన్, మహేశ్వరప్ప,హనుమంతు, శ్రీనివాసులు, రామాంజనేయులు, విద్యార్థి, యువజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Andhrapradesh
గిట్టుబాటు ధర హామీ అమలు చేయకపోతే, ఉద్యమాలతో ప్రభుత్వాన్ని కుదిపేస్తాం!

Andhrapradesh
ఆలూరు నియోజకవర్గ అభివృద్ధికి… సహాయ సహకారాలు అందించండి.

కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ భాషాను, ఆలూరు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి వీరభద్ర గౌడ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాకి వెనుకబడిన ఆలూరు నియోజవర్గంలో వేదావతి మరియు నాగరడోన రిజర్వాయర్ మరియు సాగు, మరియు తాగు నీరు సమస్యలు, రోడ్లు, నియోజకవర్గంలో వలసలు వంటి పలు సమస్యల గురించి వివరించడం జరిగింది..
Andhrapradesh
పెద్దహ్యట గ్రామంలో ఆదికవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు..

హోళగుంద మండలం పెద్దహ్యట గ్రామంలో రామాయణ సృష్టికర్త ఆది కవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా పెద్దహ్యట బోయ కాలనీలో శ్రీ.వాల్మీకి మహర్షి నూతన బోర్డును ఏర్పాటు చేసి శ్రీ.వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలు వేసి ప్రత్యేక పూజలు వేసి ఆదికవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది.
అదేవిధంగా మండల ప్రాథమిక పాఠశాలలో కూడా జిల్లా ఉన్నంత విద్య అధికారుల ఆదేశాల మేరకు ఆదికవి శ్రీ వాల్మీకి మహర్షి జయంతిని విద్యార్థులు ఉపాధ్యాయులు వాల్మీకి పెద్దలు యువకులు ఆధ్వర్యంలో శ్రీ వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలు వేసి పూజలు చేసి జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా వాల్మీకి పెద్దలు వాల్మీకి యువకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రామాయణ సృష్టికర్త శ్రీ.ఆదికవి వాల్మీకి మహర్షి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయం అని వారన్నారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ ప్రవేట్ విద్యాసంస్థలలో కూడా శ్రీ వాల్మీకి మహర్షి జయంతి ఘనంగా నిర్వహించాలని జిల్లా ఉన్నంత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం చాలా గర్వించద విషయం అని అన్నారు అదేవిధంగా బోయ వాల్మీకుల చిరకాల కోరిక బోయలను ఎస్టీ రిజర్వేషన్ కోసం స్వాతంత్రం వచ్చినప్పుడు నుండి పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు కాబట్టి ఇప్పుడైనా కూటమి ప్రభుత్వంలో బోయ వాల్మీకులను గుర్తించి ఎస్టీ రిజర్వేషన్ కల్పించాల్సిందిగా వారు కోరారు.
ఈ కార్యక్రమంలో వాల్మీకి పెద్దలు పులికొండ రంగస్వామి పులి వీరభద్ర బెలగల్ నాగరాజ్ కట్టే తిమ్మయ్య కట్టే నాగప్ప పాండురంగ తోట మారెప్ప వాల్మీకి యువకులు శ్రీరంగ తలారి మల్లయ్య బుల్లయ్య గారి రాము గిర్రప్ప గారి నాగరాజ్ పులి మల్లయ్య నాగప్ప గోపాల్ వీరేష్ మల్లి అనిమేష్ తిరుపతి నాగేంద్ర వెంకటేష్ కృష్ణ మల్లికార్జున రాజు శివప్ప నాగేష్ ఎర్రి స్వామి ఎర్రప్ప సుంకయ్య సేకయ్య గణేష్ మహేష్ భీమేష్ హరి అశోక్ కుమార్ వాల్మీకి కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు.
-
Andhrapradesh2 years ago
పాలస్తీనా పై ఇజ్రాయిల్ సాగిస్తున్న దురాక్రమణ దాడులను ఖండించండి!!
-
Andhrapradesh2 years ago
ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట భధ్రత … 1,500 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు. కర్నూలు జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్ ఐపియస్.
-
Andhrapradesh2 years ago
అసహనం లో SBI కస్టమర్స్.. నిలిచిన UPI సేవలు.
-
Andhrapradesh9 months ago
పెద్దహ్యట గ్రామంలో ఆదికవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు..
-
Andhrapradesh9 months ago
ఆలూరు నియోజకవర్గ అభివృద్ధికి… సహాయ సహకారాలు అందించండి.
-
Andhrapradesh2 years ago
సాంప్రదాయాన్ని పాటిస్తూ ,ఆచార వ్యవహారాలు కాపాడుకుందాం…
-
Andhrapradesh1 year ago
మండలంలోని సాగునీటి సమస్యలపై ప్రధాన రాజకీయ పార్టీలు తమ వైఖరి వెల్లడించాలి….సీపీఎం
-
Andhrapradesh1 year ago
ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించుకుందాం.