Andhrapradesh
పేదవారి ఆరోగ్యం పట్ల చిత్త శుద్ధి ఉన్న ఏకైక ప్రభుత్వం వైఎస్సార్ కాంగ్రేస్ ప్రభుత్వం మాత్రమేనని పేర్కొన్న ఎమ్మెల్యే శిల్పారవిరెడ్డి.


పేద వారి ఆరోగ్యం పట్ల చిత్త శుద్ధి ఉన్న ఏకైక ప్రభుత్వం వైఎస్సార్ ప్రభుత్వం మాత్రమేనని నిరూపించామని నంద్యాల శాసనసభ్యులు శిల్పారవి రెడ్డి పేర్కొన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా నంద్యాల మండలం కానాల గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిధిగా హాజరై ప్రారంభించారు. జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంప్ నందు గ్రామంలోని పేద ప్రజలకు వైద్యలు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. జగనన్న ప్రభుత్వంలో రాజకీయాలకు అతీతంగా, కుల, మతాలకు అతీతంగా పారదర్శక పాల అందించడం జరుగుతుందన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు ప్రజలకు ఇచ్చిన హామీలనే కాకుండా చెప్పని వాటిని కూడా అమలు చేస్తూ గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేస్తున్నారని అన్నారు. ప్రజల ముంగిటకే ప్రభుత్వం తీసుకువచ్చి గడపగడపకు మన ప్రభుత్వం ద్వారా ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదో అలాగే వారి యోగ క్షేమాలను, స్థానిక సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకొని అక్కడి క్కడే ప్రభుత్వ అధికారుచేత పరిష్కరించే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు. విద్య, వైద్య, రైతులకు అన్ని పథకాలు, పేద ప్రజలకు జగనన్న ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్ కాన్పెప్ట్ ద్వారా అనేక వైద్య సేవలను అందిస్తున్నామని తెలిపారు. పేద ప్రజల పక్షాల నిలిచిన జగనన్న ప్రభుత్వానికి అండగా నిలవాలని రానున్న రోజుల్లో మరో సారి జగనన్న ప్రభుత్వం అధికారం చేపట్టాలని రాష్ట్రనికి ఉజ్వల భవిషత్తును అందిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. టీడీపీ నాయకులు అభివృద్ధి ఎక్కడ జరిగింది అన్న ప్రశ్నకు ప్రతి రోజు నంద్యాల నియోజకవర్గంలో జరిగిన, జరుగుతున్న అభివృద్ధిని తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. నంద్యాలలో పేదలకు ఇచ్చే ఇళ్లపై, మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తుంటే ఆ స్థలాలపై కోర్టులకు వెళ్లిన టీడీపీ వారికి నంద్యాల నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కనిపించడంలేదా అని సూటిగా ప్రశ్నించారు. అభివృద్ధి చేస్తున్నది వైఎస్సార్సీపీ ప్రభుత్వమని, అభివృద్ధిని అడ్డుకుంటున్నది. టీడీపీ నాయకులన్నది ప్రజలు గమనిస్తున్నారన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంప్లను ప్రజలు సద్వినియోగం చేసుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బెస్త సంఘం డైరెక్టర్ చంద్రశేఖర్, గ్రామ సర్పంచ్ దూదేకుల బాపమ్మ, వైసీపీ నాయకులు విజయశేఖర్ రెడ్డి , జగదీశ్వర్ రెడ్డి ,ఎంపీడీఓ సుగుణశ్రీ, వైద్యులు, ఏఎన్ఎంలు, ఐసీడీఎస్ సిబ్బంది, ఆశావర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.

Andhrapradesh
గిట్టుబాటు ధర హామీ అమలు చేయకపోతే, ఉద్యమాలతో ప్రభుత్వాన్ని కుదిపేస్తాం!

Andhrapradesh
ఆలూరు నియోజకవర్గ అభివృద్ధికి… సహాయ సహకారాలు అందించండి.

కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ భాషాను, ఆలూరు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి వీరభద్ర గౌడ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాకి వెనుకబడిన ఆలూరు నియోజవర్గంలో వేదావతి మరియు నాగరడోన రిజర్వాయర్ మరియు సాగు, మరియు తాగు నీరు సమస్యలు, రోడ్లు, నియోజకవర్గంలో వలసలు వంటి పలు సమస్యల గురించి వివరించడం జరిగింది..
Andhrapradesh
పెద్దహ్యట గ్రామంలో ఆదికవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు..

హోళగుంద మండలం పెద్దహ్యట గ్రామంలో రామాయణ సృష్టికర్త ఆది కవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా పెద్దహ్యట బోయ కాలనీలో శ్రీ.వాల్మీకి మహర్షి నూతన బోర్డును ఏర్పాటు చేసి శ్రీ.వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలు వేసి ప్రత్యేక పూజలు వేసి ఆదికవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది.
అదేవిధంగా మండల ప్రాథమిక పాఠశాలలో కూడా జిల్లా ఉన్నంత విద్య అధికారుల ఆదేశాల మేరకు ఆదికవి శ్రీ వాల్మీకి మహర్షి జయంతిని విద్యార్థులు ఉపాధ్యాయులు వాల్మీకి పెద్దలు యువకులు ఆధ్వర్యంలో శ్రీ వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలు వేసి పూజలు చేసి జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా వాల్మీకి పెద్దలు వాల్మీకి యువకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రామాయణ సృష్టికర్త శ్రీ.ఆదికవి వాల్మీకి మహర్షి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయం అని వారన్నారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ ప్రవేట్ విద్యాసంస్థలలో కూడా శ్రీ వాల్మీకి మహర్షి జయంతి ఘనంగా నిర్వహించాలని జిల్లా ఉన్నంత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం చాలా గర్వించద విషయం అని అన్నారు అదేవిధంగా బోయ వాల్మీకుల చిరకాల కోరిక బోయలను ఎస్టీ రిజర్వేషన్ కోసం స్వాతంత్రం వచ్చినప్పుడు నుండి పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు కాబట్టి ఇప్పుడైనా కూటమి ప్రభుత్వంలో బోయ వాల్మీకులను గుర్తించి ఎస్టీ రిజర్వేషన్ కల్పించాల్సిందిగా వారు కోరారు.
ఈ కార్యక్రమంలో వాల్మీకి పెద్దలు పులికొండ రంగస్వామి పులి వీరభద్ర బెలగల్ నాగరాజ్ కట్టే తిమ్మయ్య కట్టే నాగప్ప పాండురంగ తోట మారెప్ప వాల్మీకి యువకులు శ్రీరంగ తలారి మల్లయ్య బుల్లయ్య గారి రాము గిర్రప్ప గారి నాగరాజ్ పులి మల్లయ్య నాగప్ప గోపాల్ వీరేష్ మల్లి అనిమేష్ తిరుపతి నాగేంద్ర వెంకటేష్ కృష్ణ మల్లికార్జున రాజు శివప్ప నాగేష్ ఎర్రి స్వామి ఎర్రప్ప సుంకయ్య సేకయ్య గణేష్ మహేష్ భీమేష్ హరి అశోక్ కుమార్ వాల్మీకి కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు.
-
Andhrapradesh2 years ago
పాలస్తీనా పై ఇజ్రాయిల్ సాగిస్తున్న దురాక్రమణ దాడులను ఖండించండి!!
-
Andhrapradesh2 years ago
ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట భధ్రత … 1,500 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు. కర్నూలు జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్ ఐపియస్.
-
Andhrapradesh2 years ago
అసహనం లో SBI కస్టమర్స్.. నిలిచిన UPI సేవలు.
-
Andhrapradesh9 months ago
పెద్దహ్యట గ్రామంలో ఆదికవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు..
-
Andhrapradesh9 months ago
ఆలూరు నియోజకవర్గ అభివృద్ధికి… సహాయ సహకారాలు అందించండి.
-
Andhrapradesh2 years ago
సాంప్రదాయాన్ని పాటిస్తూ ,ఆచార వ్యవహారాలు కాపాడుకుందాం…
-
Andhrapradesh1 year ago
మండలంలోని సాగునీటి సమస్యలపై ప్రధాన రాజకీయ పార్టీలు తమ వైఖరి వెల్లడించాలి….సీపీఎం
-
Andhrapradesh1 year ago
ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించుకుందాం.