Andhrapradesh
కరువు వలసలు నివారించడంలో అధికారుల వైఫల్యం.

ష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు 30 వేల రూపాయలు పరిహారంగా చెల్లించాలి.
దేవనకొండ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించినప్పటికీ కరువు సహాయక చర్యలు ఇప్పటివరకు చేపట్టకపోవడంపై సీపీఐ ధర్నా.
ఇటీవల ఖరీఫ్ సీజన్లో ఏర్పడిన తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో దేవనకొండ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించారు కానీ ఇప్పటివరకు కరువు సహాయక చర్యలు చేపట్టకపోవడం వలన వ్యవసాయ కూలీలు రైతులు సుదూర ప్రాంతాలకు వలసలకు వెళ్తున్నారు. వలసల నివారణ చర్యలో భాగంగా తక్షణమే కరువు సహాయక చర్యలు చేపట్టాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కే. మద్దిలేటి శెట్టి, సిపిఐ మండల కార్యదర్శి ఎం. నరసారావు లు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా బుధవారం భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయం ముందు సిపిఐ పట్టణ సహాయ సి.కృష్ణ అధ్యక్షతన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి వారు మాట్లాడుతూ..
దేవనకొండ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించినంత మాత్రాన సరిపోదన్నారు.తక్షణమే పంట నష్టపరిహారం డబ్బులు విడుదల చేయాలన్నారు.ఒక ఎకరాకు 40,000 వేల రూపాయల నుండి లక్ష రూపాయల దాకా నష్టపరిహారం ఇవ్వాలన్నారు.
రాబోయే ఖరీఫ్ సీజన్ కు 90% సబ్సిడీపై అన్ని రకాల విత్తనాలు రైతులకు ఇవ్వాలన్నారు.బ్యాంకుల్లో రైతులు తీసుకున్న పంట రుణాలన్నీ వడ్డీతో సహా మాఫీ చేయాలన్నారు. వలసలను నివారించి, జాతియ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలి, 200 రోజులు పనులు కల్పించాలి 600 కనీస వేతనం ఇవ్వాలన్నారు.
ఇన్సూరెన్స్ డబ్బులు, ఇన్పుట్ సబ్సిడీ, వాతావరణ బీమా డబ్బులు వెంటనే ఇవ్వాలన్నారు. తక్షణమే పశువులకు మేత ప్రభుత్వమే ఉచితంగా సరఫరా చేయాలన్నారు. కరువు మండలంగా ప్రకటించి నందున తక్షణమే కరువు సహాయక చర్యలు చేపట్టకపోతే సిపిఐ ఆధ్వర్యంలో భవిష్యత్ ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు.
ఈ ధర్నా ఈ కార్యక్రమంలో సిపిఐ మండల నాయకులు కోటకొండ హరిచంద్ర, నల్లచెలిమల బజారి, కరివేముల బాలాజీ, పాలకుర్తి అశ్వద్ధామ, సుల్తాన్, శ్రీనివాసులు, కోదండ, మహమ్మద్, రాముడు, రమేష్, దస్తగిరి, వెంకటరాముడు, మిన్నళ్ల, వీరస్వామి, రామాంజనేయులు, భాష, మహదేవ, మహేష్, విద్యార్థి, యువజన సంఘం నాయకులు భాస్కర్, మధు, రామాంజనేయులు, నాగేష్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Andhrapradesh
గిట్టుబాటు ధర హామీ అమలు చేయకపోతే, ఉద్యమాలతో ప్రభుత్వాన్ని కుదిపేస్తాం!

Andhrapradesh
ఆలూరు నియోజకవర్గ అభివృద్ధికి… సహాయ సహకారాలు అందించండి.

కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ భాషాను, ఆలూరు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి వీరభద్ర గౌడ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాకి వెనుకబడిన ఆలూరు నియోజవర్గంలో వేదావతి మరియు నాగరడోన రిజర్వాయర్ మరియు సాగు, మరియు తాగు నీరు సమస్యలు, రోడ్లు, నియోజకవర్గంలో వలసలు వంటి పలు సమస్యల గురించి వివరించడం జరిగింది..
Andhrapradesh
పెద్దహ్యట గ్రామంలో ఆదికవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు..

హోళగుంద మండలం పెద్దహ్యట గ్రామంలో రామాయణ సృష్టికర్త ఆది కవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా పెద్దహ్యట బోయ కాలనీలో శ్రీ.వాల్మీకి మహర్షి నూతన బోర్డును ఏర్పాటు చేసి శ్రీ.వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలు వేసి ప్రత్యేక పూజలు వేసి ఆదికవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది.
అదేవిధంగా మండల ప్రాథమిక పాఠశాలలో కూడా జిల్లా ఉన్నంత విద్య అధికారుల ఆదేశాల మేరకు ఆదికవి శ్రీ వాల్మీకి మహర్షి జయంతిని విద్యార్థులు ఉపాధ్యాయులు వాల్మీకి పెద్దలు యువకులు ఆధ్వర్యంలో శ్రీ వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలు వేసి పూజలు చేసి జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా వాల్మీకి పెద్దలు వాల్మీకి యువకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రామాయణ సృష్టికర్త శ్రీ.ఆదికవి వాల్మీకి మహర్షి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయం అని వారన్నారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ ప్రవేట్ విద్యాసంస్థలలో కూడా శ్రీ వాల్మీకి మహర్షి జయంతి ఘనంగా నిర్వహించాలని జిల్లా ఉన్నంత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం చాలా గర్వించద విషయం అని అన్నారు అదేవిధంగా బోయ వాల్మీకుల చిరకాల కోరిక బోయలను ఎస్టీ రిజర్వేషన్ కోసం స్వాతంత్రం వచ్చినప్పుడు నుండి పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు కాబట్టి ఇప్పుడైనా కూటమి ప్రభుత్వంలో బోయ వాల్మీకులను గుర్తించి ఎస్టీ రిజర్వేషన్ కల్పించాల్సిందిగా వారు కోరారు.
ఈ కార్యక్రమంలో వాల్మీకి పెద్దలు పులికొండ రంగస్వామి పులి వీరభద్ర బెలగల్ నాగరాజ్ కట్టే తిమ్మయ్య కట్టే నాగప్ప పాండురంగ తోట మారెప్ప వాల్మీకి యువకులు శ్రీరంగ తలారి మల్లయ్య బుల్లయ్య గారి రాము గిర్రప్ప గారి నాగరాజ్ పులి మల్లయ్య నాగప్ప గోపాల్ వీరేష్ మల్లి అనిమేష్ తిరుపతి నాగేంద్ర వెంకటేష్ కృష్ణ మల్లికార్జున రాజు శివప్ప నాగేష్ ఎర్రి స్వామి ఎర్రప్ప సుంకయ్య సేకయ్య గణేష్ మహేష్ భీమేష్ హరి అశోక్ కుమార్ వాల్మీకి కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు.
-
Andhrapradesh2 years ago
పాలస్తీనా పై ఇజ్రాయిల్ సాగిస్తున్న దురాక్రమణ దాడులను ఖండించండి!!
-
Andhrapradesh2 years ago
ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట భధ్రత … 1,500 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు. కర్నూలు జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్ ఐపియస్.
-
Andhrapradesh2 years ago
అసహనం లో SBI కస్టమర్స్.. నిలిచిన UPI సేవలు.
-
Andhrapradesh9 months ago
పెద్దహ్యట గ్రామంలో ఆదికవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు..
-
Andhrapradesh9 months ago
ఆలూరు నియోజకవర్గ అభివృద్ధికి… సహాయ సహకారాలు అందించండి.
-
Andhrapradesh2 years ago
సాంప్రదాయాన్ని పాటిస్తూ ,ఆచార వ్యవహారాలు కాపాడుకుందాం…
-
Andhrapradesh1 year ago
మండలంలోని సాగునీటి సమస్యలపై ప్రధాన రాజకీయ పార్టీలు తమ వైఖరి వెల్లడించాలి….సీపీఎం
-
Andhrapradesh1 year ago
ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించుకుందాం.