Connect with us

Andhrapradesh

అసమానతలు లేని అభివృద్ధి కై పోరాటం….. సిపిఎం..

Published

on

207 Views

అసమానత లేని అభివృద్ధి కోసం ఉద్యమిద్దామని, సిపిఎం పార్టీ రాబోయే రోజుల్లో అటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్తుందని సిపిఎం జిల్లా నాయకులు బి వీర శేఖర్, మండల నాయకులు సూరి మహబూబ్ బాషా లు పేర్కొన్నారు .

గురువారం నాడు రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి అసమానతులేని అభివృద్ధి కోసం చేపట్టిన బస్సు యాత్ర 30 తేదీన ఆదోనిలో ప్రారంభమై నవంబర్ 15న విజయవాడలో భారీ బహిరంగ సభ తో ముస్తుందని ఈ నేపథ్యంలో బహిరంగ సభ విజయవంతం మండలంలోని సాగునీటి సమస్య పరిష్కారం కోసం పంట కాలువల నిర్మాణం, కరువు, విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం మండల కమిటీ ఆధ్వర్యంలో దేవనకొండ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆటో జాతను ఆ పార్టీ సీనియర్ నాయకులు బజారి జండా ఊపి ప్రారంభించారు

ఈ సందర్భంగా మండల కమిటీ సభ్యుల అశోక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అప్పుల కుప్పగా మిగిలిందని, రాష్ట్ర విభజన తరువాత నష్టపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాడని నమ్ముకున్న చంద్రబాబు నాయుడు నట్టేట ముంచ్చారని విమర్శించారు, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా రాష్ట్రానికి ప్రత్యేక హోదా వెనుకబండ ప్రాంతాల అభివృద్ధి జాతీయ ప్రాజెక్టుల సాధనలో చితికిల పడ్డాడని ఆంధ్ర ప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవాన్ని కేంద్ర ప్రభుత్వం దగ్గర తాకట్టు పెట్టారని వారు విమర్శించారు.

రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబడిన జిల్లాలకు అభివృద్ధికి నిధులు సాధించలేకపోయారని ఉద్యోగాలు ఇవ్వలేక ఉపాధి అవకాశాలు కల్పించలేక నిరుద్యోగ యువతను నమ్మించి మోసం చేసి ఓట్లు వేయించుకున్నారని తెలిపారు,అధికారo చేపట్టిన తర్వాత కేంద్ర బిజెపి ప్రభుత్వం చేసే చట్టాలకు మద్దతిస్తూ ప్రజలపై భారాలు వేస్తూ కార్పొరేట్లకు ప్రజల సంపదను అప్పగిస్తున్నారని అన్నారు, కేంద్ర బిజెపి ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచుతూన్న ప్రశ్నించకపోగా ఆధారంగా పనుల రూపంలో వసూలు చేసు కుంటున్నారని విమర్శించారు.

అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడని నమ్మిన ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు ఓట్లేస్తే కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారికి నిధులను ఇవ్వకుండా నవరత్నాల పేరుతో మోసం చేస్తున్నారని విమర్శించారు, ఈ సందర్భంగా జాత దేవనకొండ పల్లె దొడ్డి ,వెంకటాపురం , నేలతల మరి, గుండ్లకొండ, గుడిమరాళ్ల ,బంటుపల్లి, బేతపల్లి, కోటకొండ, నెల్లిబండ ,పాలకుర్తి, తెర్నేకల్లు ,కుంకనూరు ,పొట్లపాడు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు.

అదేవిధంగా 30వ తేదీన పత్తికొండలో అంబేద్కర్ సర్కిల్లో జరుగు భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని ,ఈ బహిరంగ సభకు జరిగే బహిరంగ సభకు సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఎం.ఏ గఫూర్ గారు పాల్గొని ప్రసంగిస్తారు, ఈ బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ జాతా కార్యక్రమంలో సిపిఎం నాయకులు సుంకన్న శ్రీనివాసులు కౌలుట్ల స్వామి నాగరాజు వీరన్న విజయ్ తదితరులు పాల్గొన్నారు.

Andhrapradesh

గిట్టుబాటు ధర హామీ అమలు చేయకపోతే, ఉద్యమాలతో ప్రభుత్వాన్ని కుదిపేస్తాం!

Published

on

153 Views

రైతులకు గిట్టుబాటు ధరల హామీ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి! డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫారసులు కాగితాల్లో మాత్రమే మిగిలిపోవాలి కాదు, అమలులోకి రావాలి! జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి!

రైతులు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. రాష్ట్రంలో 200 రకాలకుపైగా పంటలు పండితే, కేవలం 20-25 పంటలకే మద్దతు ధర ప్రకటించడం కక్ష సాధింపు చర్య కాదు అంటే ఏమిటి? అదీ కూడా మార్కెట్‌లో ధరలు పెరిగినప్పుడే ప్రభుత్వం రైతులకు మద్దతు ధర ఇచ్చినట్లు నటిస్తోంది. ప్రస్తుతం ఏ గ్రేడ్ మిర్చి ధర ₹17,000 ఉండగా, ప్రభుత్వం ₹11,700 ఇస్తున్నామని చెప్పుకోవడం హాస్యాస్పదం. ఒకరికి రూ. 5,000 కట్ చేసి మరొకరికి వేల కోట్లు మాఫీ చేయడమేనా పాలన?

రైతుల పేరిట ఓట్లు వేయించుకుని, అధికారంలోకి వచ్చాక రైతులను పక్కన పెట్టే ప్రభుత్వాలను భరించేది లేదు! ఏపీ అంటే కేవలం అమరావతి, పోలవరమే కాదు. రైతుల శ్రమ, కష్టం, కన్నీళ్ల మీద నిర్మించుకున్న భవనాలే కాదా? మద్దతు ధర ఇవ్వకపోతే వ్యవసాయమే క్షీణించిపోతుంది. నకిలీ విత్తనాలు, పురుగు మందులతో రైతులను మోసం చేసే ముఠాలను అరికట్టాల్సింది పోయి, రైతుల్ని రెక్కల ముక్కలు చేసేందుకు కుట్రలు చేస్తున్నారా?

రైతు సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోతే, రాష్ట్రవ్యాప్తంగా రైతులెవరూ క్షమించరు! ప్రభుత్వం గట్టిగా స్పందించకపోతే, రైతు చైతన్య యాత్రలు చేస్తాం, పోరాటాలు మిన్నంటిస్తాం! రైతు సంఘం దీక్షలు, ఉద్యమాలు ఎంత దూరమైనా వెళ్లే వరకు వెనక్కి తగ్గేది లేదు. ఈ కార్యక్రమంలో సీపీఐ రైతు సంఘం నాయకులు కృష్ణ, రవికుమార్, అనుమప్ప, కోదండ, మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.

 

 

4o

Continue Reading

Andhrapradesh

ఆలూరు నియోజకవర్గ అభివృద్ధికి… సహాయ సహకారాలు అందించండి.

Published

on

కలెక్టరు రంజిత్ బాషాను కలిసిన వీరభద్ర గౌడ
281 Views

కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ భాషాను, ఆలూరు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి వీరభద్ర గౌడ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాకి వెనుకబడిన ఆలూరు నియోజవర్గంలో వేదావతి మరియు నాగరడోన రిజర్వాయర్ మరియు సాగు, మరియు తాగు నీరు సమస్యలు, రోడ్లు, నియోజకవర్గంలో వలసలు వంటి పలు సమస్యల గురించి వివరించడం జరిగింది..

Continue Reading

Andhrapradesh

పెద్దహ్యట గ్రామంలో ఆదికవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు..

Published

on

271 Views

హోళగుంద మండలం పెద్దహ్యట గ్రామంలో రామాయణ సృష్టికర్త ఆది కవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా పెద్దహ్యట బోయ కాలనీలో శ్రీ.వాల్మీకి మహర్షి నూతన బోర్డును ఏర్పాటు చేసి శ్రీ.వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలు వేసి ప్రత్యేక పూజలు వేసి ఆదికవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది.

అదేవిధంగా మండల ప్రాథమిక పాఠశాలలో కూడా జిల్లా ఉన్నంత విద్య అధికారుల ఆదేశాల మేరకు ఆదికవి శ్రీ వాల్మీకి మహర్షి జయంతిని విద్యార్థులు ఉపాధ్యాయులు వాల్మీకి పెద్దలు యువకులు ఆధ్వర్యంలో శ్రీ వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలు వేసి పూజలు చేసి జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా వాల్మీకి పెద్దలు వాల్మీకి యువకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రామాయణ సృష్టికర్త శ్రీ.ఆదికవి వాల్మీకి మహర్షి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయం అని వారన్నారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ ప్రవేట్ విద్యాసంస్థలలో కూడా శ్రీ వాల్మీకి మహర్షి జయంతి ఘనంగా నిర్వహించాలని జిల్లా ఉన్నంత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం చాలా గర్వించద విషయం అని అన్నారు అదేవిధంగా బోయ వాల్మీకుల చిరకాల కోరిక బోయలను ఎస్టీ రిజర్వేషన్ కోసం స్వాతంత్రం వచ్చినప్పుడు నుండి పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు కాబట్టి ఇప్పుడైనా కూటమి ప్రభుత్వంలో బోయ వాల్మీకులను గుర్తించి ఎస్టీ రిజర్వేషన్ కల్పించాల్సిందిగా వారు కోరారు.

ఈ కార్యక్రమంలో వాల్మీకి పెద్దలు పులికొండ రంగస్వామి పులి వీరభద్ర బెలగల్ నాగరాజ్ కట్టే తిమ్మయ్య కట్టే నాగప్ప పాండురంగ తోట మారెప్ప వాల్మీకి యువకులు శ్రీరంగ తలారి మల్లయ్య బుల్లయ్య గారి రాము గిర్రప్ప గారి నాగరాజ్ పులి మల్లయ్య నాగప్ప గోపాల్ వీరేష్ మల్లి అనిమేష్ తిరుపతి నాగేంద్ర వెంకటేష్ కృష్ణ మల్లికార్జున రాజు శివప్ప నాగేష్ ఎర్రి స్వామి ఎర్రప్ప సుంకయ్య సేకయ్య గణేష్ మహేష్ భీమేష్ హరి అశోక్ కుమార్ వాల్మీకి కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

Trending

Home
Ap News
Login
Reporters