Andhrapradesh
ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట భధ్రత … 1,500 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు. కర్నూలు జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్ ఐపియస్.

ముఖ్యమంత్రి అక్టోబర్ 19 న కర్నూలు జిల్లా , ఎమ్మిగనూరు పట్టణం కు రాక.
ఎమ్మిగనూరు బహిరంగ సభ మరియు ఓర్వకల్లు ఎయిర్ పోర్టు లో భద్రతా ఏర్పాట్ల ను పరిశీలించిన … జిల్లా ఎస్పీ.

జగనన్న చేదోడు నాలుగవ విడత నగదు పంపిణీలో బాగంగా 2023 అక్టోబర్ 19 వ ( గురువారం) తేదీన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి రాక సందర్భంగా ఎమ్మిగనూరు వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ మైదానంలో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభ మరియు ఓర్వకల్లు ఎయిర్ పోర్టు లో జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్ ఐపియస్ భద్రత ఏర్పాట్లను పరిశీలించారు.

ఎమ్మిగనూరు బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలనలో జిల్లా ఎస్పీతో పాటు జిల్లా కలెక్టర్ డా.జి.సృజన ఐఏయస్ , ఎమ్మిగనూరు శాసనసభ్యులు చెన్నకేశవ రెడ్డి, ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్ ఉన్నారు. బహిరంగ సభ, బ్యారికెడింగ్, పార్కింగ్ ప్రదేశాలు, ట్రాఫిక్ క్రమబద్దీకరణ , ఇతర భద్రత ఏర్పాట్ల గురించి ఆరా తీశారు. ముఖ్యమంత్రి పర్యటన నిమిత్తం ఎమ్మిగనూరు – ఆదోని బైపాస్ నందు ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ను పరిశీలించారు. బందోబస్తు విధులు నిర్వహించే పోలీసులు, స్పెషల్ పార్టీ పోలీసు బృందాలు , పోలీసు జాగీలాలు, బాంబ్ స్క్వాడ్ బృందాలతో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ తెలిపారు. 12 మంది డిఎస్పీలు, 56 మంది సిఐలు, 95 మంది ఎస్సైలు, 250 మంది ఎఎస్సైలు / హెడ్ కానిస్టేబుళ్ళు, 600 మంది కానిస్టేబుళ్ళు, 60 మంది మహిళా పోలీసులు, 400 మంది హోంగార్డులు, 2 సెక్షన్ల ఎఆర్ పోలీసులు, 2 స్పెషల్ పార్టీ పోలీసు బృందాలను బందోబస్తు విధులకు కేటాయించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ వెంట అడిషనల్ ఎస్పీ అడ్మిన్ టి. సర్కార్, కర్నూలు పట్టణ డిఎస్పీ విజయశేఖర్, ఎమ్మిగనూరు డిఎస్పీ సీతా రామయ్య, కర్నూలు ఎస్సీ ఎస్టి సెల్ డిఎస్పీ యుగంధర్ బాబు, సిసియస్ డిఎస్పీ శ్రీనివాసులు , సిఐలు ప్రసాద్, శ్రీనివాస రెడ్డి, మధుసూధన్ రావు , ఎరిషావలి మరియు ఇతర శాఖల అధికారులు ఉన్నారు.

Andhrapradesh
గిట్టుబాటు ధర హామీ అమలు చేయకపోతే, ఉద్యమాలతో ప్రభుత్వాన్ని కుదిపేస్తాం!

Andhrapradesh
ఆలూరు నియోజకవర్గ అభివృద్ధికి… సహాయ సహకారాలు అందించండి.

కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ భాషాను, ఆలూరు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి వీరభద్ర గౌడ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాకి వెనుకబడిన ఆలూరు నియోజవర్గంలో వేదావతి మరియు నాగరడోన రిజర్వాయర్ మరియు సాగు, మరియు తాగు నీరు సమస్యలు, రోడ్లు, నియోజకవర్గంలో వలసలు వంటి పలు సమస్యల గురించి వివరించడం జరిగింది..
Andhrapradesh
పెద్దహ్యట గ్రామంలో ఆదికవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు..

హోళగుంద మండలం పెద్దహ్యట గ్రామంలో రామాయణ సృష్టికర్త ఆది కవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా పెద్దహ్యట బోయ కాలనీలో శ్రీ.వాల్మీకి మహర్షి నూతన బోర్డును ఏర్పాటు చేసి శ్రీ.వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలు వేసి ప్రత్యేక పూజలు వేసి ఆదికవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది.
అదేవిధంగా మండల ప్రాథమిక పాఠశాలలో కూడా జిల్లా ఉన్నంత విద్య అధికారుల ఆదేశాల మేరకు ఆదికవి శ్రీ వాల్మీకి మహర్షి జయంతిని విద్యార్థులు ఉపాధ్యాయులు వాల్మీకి పెద్దలు యువకులు ఆధ్వర్యంలో శ్రీ వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలు వేసి పూజలు చేసి జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా వాల్మీకి పెద్దలు వాల్మీకి యువకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రామాయణ సృష్టికర్త శ్రీ.ఆదికవి వాల్మీకి మహర్షి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయం అని వారన్నారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ ప్రవేట్ విద్యాసంస్థలలో కూడా శ్రీ వాల్మీకి మహర్షి జయంతి ఘనంగా నిర్వహించాలని జిల్లా ఉన్నంత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం చాలా గర్వించద విషయం అని అన్నారు అదేవిధంగా బోయ వాల్మీకుల చిరకాల కోరిక బోయలను ఎస్టీ రిజర్వేషన్ కోసం స్వాతంత్రం వచ్చినప్పుడు నుండి పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు కాబట్టి ఇప్పుడైనా కూటమి ప్రభుత్వంలో బోయ వాల్మీకులను గుర్తించి ఎస్టీ రిజర్వేషన్ కల్పించాల్సిందిగా వారు కోరారు.
ఈ కార్యక్రమంలో వాల్మీకి పెద్దలు పులికొండ రంగస్వామి పులి వీరభద్ర బెలగల్ నాగరాజ్ కట్టే తిమ్మయ్య కట్టే నాగప్ప పాండురంగ తోట మారెప్ప వాల్మీకి యువకులు శ్రీరంగ తలారి మల్లయ్య బుల్లయ్య గారి రాము గిర్రప్ప గారి నాగరాజ్ పులి మల్లయ్య నాగప్ప గోపాల్ వీరేష్ మల్లి అనిమేష్ తిరుపతి నాగేంద్ర వెంకటేష్ కృష్ణ మల్లికార్జున రాజు శివప్ప నాగేష్ ఎర్రి స్వామి ఎర్రప్ప సుంకయ్య సేకయ్య గణేష్ మహేష్ భీమేష్ హరి అశోక్ కుమార్ వాల్మీకి కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు.
-
Andhrapradesh2 years ago
పాలస్తీనా పై ఇజ్రాయిల్ సాగిస్తున్న దురాక్రమణ దాడులను ఖండించండి!!
-
Andhrapradesh2 years ago
అసహనం లో SBI కస్టమర్స్.. నిలిచిన UPI సేవలు.
-
Andhrapradesh9 months ago
పెద్దహ్యట గ్రామంలో ఆదికవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు..
-
Andhrapradesh9 months ago
ఆలూరు నియోజకవర్గ అభివృద్ధికి… సహాయ సహకారాలు అందించండి.
-
Andhrapradesh2 years ago
సాంప్రదాయాన్ని పాటిస్తూ ,ఆచార వ్యవహారాలు కాపాడుకుందాం…
-
Andhrapradesh1 year ago
మండలంలోని సాగునీటి సమస్యలపై ప్రధాన రాజకీయ పార్టీలు తమ వైఖరి వెల్లడించాలి….సీపీఎం
-
Andhrapradesh1 year ago
ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించుకుందాం.
-
Crime News2 years ago
ప్రవల్లిక కేసు .. చిక్కడపల్లి ఇన్స్పెక్టర్పై సస్పెన్షన్ వేటుపడింది.