Connect with us

Andhrapradesh

ప్రయాణికుల గుడ్ న్యూస్.. దసరా వేళ 600 ప్రత్యేక రైళ్లు.. ప్రకటించిన సౌత్ సెంట్రల్ రైల్వే..

Published

on

190 Views

హైదరాబాద్, అక్టోబర్ 16: అసలే పండుగ సీజన్.. పైగా స్కూళ్లు, కాలేజీలకు సెలవు.. వెరసి ప్రజంతా పట్టణం నుంచి తమ తమ ఊళ్లకు పయనం అవుతున్నారు. అయితే, పండుగ వేళ వాహనాలన్నీ ఫుల్ బిజీగా ఉంటాయి. ఈ దసరా పండుగలో ఇంటికి వెళ్లాలని లేదా ట్రిప్‌కు వెళ్లాలని అనుకున్న వారికి సాధారణ రైళ్లలో సీట్లు దొరకడం కష్టం. ఇలాంటి సమయంలో ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (SCR) శుభవార్త చెప్పింది. దాదాపు 620 ప్రత్యేక రైళ్లు వివిధ ప్రాంతాల నుండి రెండు తెలుగు రాష్ట్రాలు సహా ఇతర పొరుగు రాష్ట్రాలకు నడపునున్నట్లు ప్రకటించింది.

అక్టోబర్‌లో పండుగల నెల కావడంతో ప్రయాణానికి ఇబ్బంది లేకుండా చేసేందుకు ఈ ప్రత్యేక రైళ్లను నడపడానికి SCR సిద్ధమైంది. జంట నగరాలైన సికింద్రాబాద్, హైదరాబాద్ రైల్వే స్టేషన్లు, కాచిగూడ, లింగంపల్లితో సహా ప్రధాన రైల్వే స్టేషన్ల నుండి ఈ ప్రత్రేక రైళ్లు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

ఈ పండుగల సీజన్‌లో, విజయవాడ, మచిలీపట్నం, కాకినాడ, తిరుపతి, విశాఖపట్నంతో సహా వివిధ ప్రాంతాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రయాణికులు ఎక్కువగా ప్రయాణిస్తారు. ఈ సమయంలో ప్రయాణికుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య దాదాపు 200 ట్రిప్పులు షెడ్యూల్ చేస్తోంది సౌత్ సెంట్రల్ రైల్వే. అలాగే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా.. ఇతర రాష్ట్రాలకు వెళ్లే వారి కోసం కూడా ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి. జైపూర్, షిర్డీ, రామేశ్వరం, రద్దీ గల ఇతర ప్రధాన ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది దక్షిణ మధ్య రైల్వే.

“ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, ప్రత్యేక రైళ్లను ప్లాన్ చేయడం జరిగింది. గతేడాదితో పోలిస్తే ఇప్పుడు దాదాపు 100 సర్వీసులు అదనంగా నడుస్తున్నాయి. రోజూ రెగ్యులర్ రూట్‌లను నిరంతరం పర్యవేక్షించడం జరుగుతుంది. ఒక మార్గంలో రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు.. సాధారణ రైళ్ల కోచ్‌లను పెంచుతాము.’’ అని సీనియర్ రైల్వే అధికారి తెలిపారు. అంతేకాకుండా, ప్రత్యేకంగా రైలును నడిపేందుకు కోచ్‌లు అందుబాటులో ఉంటే.. రైళ్లను కూడా ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉపాధి నిమిత్తం వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడిన వారు ఉంటారు. దసరా పండుగ వేళ విద్యాసంస్థలు విద్యార్థులకు దసరా సెలవులు ప్రకటించడం.. పండుగ వేళ చాలా కుటుంబాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశంలోని ఇతర రాష్ట్రాలలో వివిధ ప్రాంతాలకు వెళ్తుంటారు. వీరిని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయడం జరిగింది. వీటిలో 140 రైళ్లు SCR జోన్ వెలుపల ప్రయాణీకులను తీసుకెళ్లడానికి, పండుగ సీజన్లో ఇతర రాష్ట్రాల నుండి సౌత్ సెంట్రల్ జోన్‌లోకి ప్రయాణికులను తీసుకురావడానికి షెడ్యూల్ చేయడం జరిగింది’ అని రైల్వే అధికారులు తెలిపారు.

దసరా పండుగ సందర్భంగా పవిత్ర పుణ్యక్షేత్రాలకు వెళ్లే ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని SCR ఇప్పటికే ‘భారత్ గౌరవ్ టూరిస్ట్’ రైళ్లను ప్రవేశపెట్టింది. ఈ నెలలో, రెండు ‘భారత్ గౌరవ్’ రైళ్లు కాశీ, పూరి, అయోధ్య, రామేశ్వరం, మొదలైన పవిత్ర స్థలాలకు ప్రయాణిస్తాయి. ప్రయాణికుల సౌకర్యార్థం తగిన సిబ్బందితో అదనపు టికెట్ కౌంటర్లు, మార్గదర్శకాలను అందుబాటులో ఉంచుతామని రైల్వే అధికారులు తెలిపారు. రైల్వే స్టేషన్ల పునరుద్ధరణ పనులు చేపట్టడంతో అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నారు.

Andhrapradesh

గిట్టుబాటు ధర హామీ అమలు చేయకపోతే, ఉద్యమాలతో ప్రభుత్వాన్ని కుదిపేస్తాం!

Published

on

153 Views

రైతులకు గిట్టుబాటు ధరల హామీ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి! డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫారసులు కాగితాల్లో మాత్రమే మిగిలిపోవాలి కాదు, అమలులోకి రావాలి! జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి!

రైతులు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. రాష్ట్రంలో 200 రకాలకుపైగా పంటలు పండితే, కేవలం 20-25 పంటలకే మద్దతు ధర ప్రకటించడం కక్ష సాధింపు చర్య కాదు అంటే ఏమిటి? అదీ కూడా మార్కెట్‌లో ధరలు పెరిగినప్పుడే ప్రభుత్వం రైతులకు మద్దతు ధర ఇచ్చినట్లు నటిస్తోంది. ప్రస్తుతం ఏ గ్రేడ్ మిర్చి ధర ₹17,000 ఉండగా, ప్రభుత్వం ₹11,700 ఇస్తున్నామని చెప్పుకోవడం హాస్యాస్పదం. ఒకరికి రూ. 5,000 కట్ చేసి మరొకరికి వేల కోట్లు మాఫీ చేయడమేనా పాలన?

రైతుల పేరిట ఓట్లు వేయించుకుని, అధికారంలోకి వచ్చాక రైతులను పక్కన పెట్టే ప్రభుత్వాలను భరించేది లేదు! ఏపీ అంటే కేవలం అమరావతి, పోలవరమే కాదు. రైతుల శ్రమ, కష్టం, కన్నీళ్ల మీద నిర్మించుకున్న భవనాలే కాదా? మద్దతు ధర ఇవ్వకపోతే వ్యవసాయమే క్షీణించిపోతుంది. నకిలీ విత్తనాలు, పురుగు మందులతో రైతులను మోసం చేసే ముఠాలను అరికట్టాల్సింది పోయి, రైతుల్ని రెక్కల ముక్కలు చేసేందుకు కుట్రలు చేస్తున్నారా?

రైతు సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోతే, రాష్ట్రవ్యాప్తంగా రైతులెవరూ క్షమించరు! ప్రభుత్వం గట్టిగా స్పందించకపోతే, రైతు చైతన్య యాత్రలు చేస్తాం, పోరాటాలు మిన్నంటిస్తాం! రైతు సంఘం దీక్షలు, ఉద్యమాలు ఎంత దూరమైనా వెళ్లే వరకు వెనక్కి తగ్గేది లేదు. ఈ కార్యక్రమంలో సీపీఐ రైతు సంఘం నాయకులు కృష్ణ, రవికుమార్, అనుమప్ప, కోదండ, మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.

 

 

4o

Continue Reading

Andhrapradesh

ఆలూరు నియోజకవర్గ అభివృద్ధికి… సహాయ సహకారాలు అందించండి.

Published

on

కలెక్టరు రంజిత్ బాషాను కలిసిన వీరభద్ర గౌడ
281 Views

కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ భాషాను, ఆలూరు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి వీరభద్ర గౌడ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాకి వెనుకబడిన ఆలూరు నియోజవర్గంలో వేదావతి మరియు నాగరడోన రిజర్వాయర్ మరియు సాగు, మరియు తాగు నీరు సమస్యలు, రోడ్లు, నియోజకవర్గంలో వలసలు వంటి పలు సమస్యల గురించి వివరించడం జరిగింది..

Continue Reading

Andhrapradesh

పెద్దహ్యట గ్రామంలో ఆదికవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు..

Published

on

271 Views

హోళగుంద మండలం పెద్దహ్యట గ్రామంలో రామాయణ సృష్టికర్త ఆది కవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా పెద్దహ్యట బోయ కాలనీలో శ్రీ.వాల్మీకి మహర్షి నూతన బోర్డును ఏర్పాటు చేసి శ్రీ.వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలు వేసి ప్రత్యేక పూజలు వేసి ఆదికవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది.

అదేవిధంగా మండల ప్రాథమిక పాఠశాలలో కూడా జిల్లా ఉన్నంత విద్య అధికారుల ఆదేశాల మేరకు ఆదికవి శ్రీ వాల్మీకి మహర్షి జయంతిని విద్యార్థులు ఉపాధ్యాయులు వాల్మీకి పెద్దలు యువకులు ఆధ్వర్యంలో శ్రీ వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలు వేసి పూజలు చేసి జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా వాల్మీకి పెద్దలు వాల్మీకి యువకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రామాయణ సృష్టికర్త శ్రీ.ఆదికవి వాల్మీకి మహర్షి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయం అని వారన్నారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ ప్రవేట్ విద్యాసంస్థలలో కూడా శ్రీ వాల్మీకి మహర్షి జయంతి ఘనంగా నిర్వహించాలని జిల్లా ఉన్నంత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం చాలా గర్వించద విషయం అని అన్నారు అదేవిధంగా బోయ వాల్మీకుల చిరకాల కోరిక బోయలను ఎస్టీ రిజర్వేషన్ కోసం స్వాతంత్రం వచ్చినప్పుడు నుండి పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు కాబట్టి ఇప్పుడైనా కూటమి ప్రభుత్వంలో బోయ వాల్మీకులను గుర్తించి ఎస్టీ రిజర్వేషన్ కల్పించాల్సిందిగా వారు కోరారు.

ఈ కార్యక్రమంలో వాల్మీకి పెద్దలు పులికొండ రంగస్వామి పులి వీరభద్ర బెలగల్ నాగరాజ్ కట్టే తిమ్మయ్య కట్టే నాగప్ప పాండురంగ తోట మారెప్ప వాల్మీకి యువకులు శ్రీరంగ తలారి మల్లయ్య బుల్లయ్య గారి రాము గిర్రప్ప గారి నాగరాజ్ పులి మల్లయ్య నాగప్ప గోపాల్ వీరేష్ మల్లి అనిమేష్ తిరుపతి నాగేంద్ర వెంకటేష్ కృష్ణ మల్లికార్జున రాజు శివప్ప నాగేష్ ఎర్రి స్వామి ఎర్రప్ప సుంకయ్య సేకయ్య గణేష్ మహేష్ భీమేష్ హరి అశోక్ కుమార్ వాల్మీకి కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

Trending

Home
Ap News
Login
Reporters