Politics
పాలేరు సీటు సిపిఎం కు కేటాయిస్తారా…ఎవరు ఎక్కడ పోటీ చేస్తారు..!పాలేరు పై కొత్త చర్చ..మోగిన ఎన్నికల నగారా .. విడుదలైన షెడ్యూల్..

రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులను ప్రకటించి బి ఆర్ఎస్ ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతోంది.. కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ప్రకటన ఇంకా ఆలస్యం అవుతుందంటున్నారు.. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ని పాలేరు నియోజకవర్గం పై కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది.. పాలేరు నియోజకవర్గం సిపిఎం పార్టీకి కేటాయిస్తారని ఆసక్తికర చర్చ జరుగుతోంది… వామపక్షాలతో పొత్తు ఖరారు అయితే తమకు పాలేరు కేటాయించాలని సిపిఎం కోరుతున్నట్లు తెలుస్తోంది.. మరోపక్క మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరు పాలేరు నియోజకవర్గం టికెట్టు కోరుతున్న విషయం తెలిసిందే… ఇదిలా ఉంటే పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి కొత్తగూడెం నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని ప్రచారం ఒకపక్క జరుగుతుంది.. అదే సందర్భంలో మరోపక్క పొంగులేటి సోదరుడు ప్రసాదరెడ్డి పాలేరు నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారంలో ఉన్నారు… ఇప్పుడు తాజాగా పాలేరు సిపిఎంకు కేటాయిస్తారని కొత్త చర్చ ఆసక్తిని రేపుతోంది…
Andhrapradesh
గిట్టుబాటు ధర హామీ అమలు చేయకపోతే, ఉద్యమాలతో ప్రభుత్వాన్ని కుదిపేస్తాం!

Andhrapradesh
పరిపూర్ణ ప్రజాస్వామ్యవాది సీతారాం ఏచూరి…… ఘనంగా సితారాం ఏచూరి కి నివాళి…

భారత దేశ రాజకీయాల్లో పరిపూర్ణ ప్రజాస్వామ్యవాది పీడిత ప్రజల ఆశాజ్యోతి కామ్రేడ్ సీతారాం ఏచూరి అని సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్,మాజీ విద్యార్థి సంఘం నాయకులు, మాజీ సర్పంచ్ ఉచ్చిరప్ప, వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ తపాల శ్రీనివాసులు సిపిఐ మండల కార్యదర్శి నరసరావు మాజీ రైతు సంఘం నాయకులు ఉప్పర నరసప్ప లు పేర్కొన్నారు.
గురువారం నాడు దేవనకొండ మండల కేంద్రంలో సిపిఎం ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి సంస్మరణ సభ స్థానిక ముగితాత ఆవరణలో జరిగింది.
పార్టీ జిల్లా నాయకులు బి వీర శేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ దేశం గర్వించదగ్గ నాయకుడు సీతారాం ఏచూరి అని రాజకీయాలు ఏమైనా సమస్యల ప్రతిపాదికన చట్టసభల్లోను అదేవిధంగా పార్లమెంట్ బయట అణగారిన వర్గాల కోసం భారత రాజ్యాంగ విలువలు కోసం, రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం రాజ్యాంగ పరిరక్షణకై కట్టుబడి పని చేశారని పేర్కొన్నారు.
సనాతన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన దళిత గిరిజన వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు పోరాడినడ వ్యక్తి సీతారాం ఏచూరి అని పేర్కొన్నారు.
వివిధ భావాలు, సిద్ధాంతాలు ఉన్న రాజకీయాల్లో అందరినీ కలుపుకొని సమస్య పరిష్కారమే లక్ష్యంగా ఉమ్మడి పోరాటం చేశారని పేర్కొన్నారు.
విద్యార్థి దశలోనే జేఎన్టీయూ నాయకుడిగా ఇందిరా గాంధీ నిలదీసి విసీ పదవికి రాజీనామా చేయించారని, విద్యార్థి నాయకుడిగా అందరికీ విద్యానదించాలనే పోరాటాన్ని దేశవ్యాప్తం చేశాడని పేర్కొన్నారు.
తదనంతర రోజుల్లో ప్రజా నాయకుడిగా తిరుగులేని నేతగా ఎదిగాడని భారతదేశ మౌలిక పరిస్థితులు సాంప్రదాయాలను అర్థం చేసుకొని దేశ ప్రజానీకానికి తగ్గట్టు చట్టాలు ఉండాలని పోరాడిన వ్యక్తి సీతారాం ఏచూరి అని కొనియాడారు కమ్యూనిస్టు పార్టీలో మూడు తరాల వ్యక్తులతో పనిచేసిన సీతారాం తన మేధస్సునంత ఉపయోగించి భారతదేశానికి విశేష సేవ అందించారని అనేక రైతాంగ కార్మిక విద్యార్థి యువజన ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొని విజయాలు సాధించారని పేర్కొన్నారు.
భారతదేశంలోని కాకుండా ప్రపంచవ్యాప్తంగా మంచి దౌత్యవ్యక్త గా వివాదాల పరిష్కారకునిగా భారతదేశ ప్రతిష్టను ఇనుమడింప చేశారని పేర్కొన్నారు.
ఆయన నడిచిన బాటలో పేద మరియు అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడమే ఈరోజు మనందరి బాధ్యతని పేర్కొన్నారు. సీతారాం గారికి నిజమైన నివాళి ఆయన ఆశయాలు ముందుకు తీసుకోవడమేనని భవిష్యత్తులో వామపక్షాలు ఆయన ఆశయాలు ముందుకు తీసుకోవడంలో అందరూ సహకరిస్తారని పేర్కొన్నారు.
సమ సమాజ నిర్మాణం కోసం ఆయన కన్న కలలు నిజం చేసే విధంగా నేటి కార్యకర్తలు పనిచేయాల్సి ఉంటుందని ఆ బాధ్యత నేటితరం భుజాన చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం మరియు ఆ పార్టీ ప్రజాసంఘాల నాయకులు అశోక్, సూరి ,యుసుప్ బాషా, మహబూబ్ బాషా, బజారి, గాజుల శ్రీనివాసులు, లక్ష్మిరెడ్డి, నాగేష్ ,మహేంద్ర ,నాగేంద్ర, బలరాముడు, వీరేంద్ర ,పరమేష్ ,జ్యోతి వెంకటేష్ ,మనోహర్ ,సుధాకర్, రవి ,సుభాన్ ,సుంకన్న, మార్కండేయులు తదితరులు పాల్గొన్నారు.
Andhrapradesh
సీతారాం ఏచూరి మృతి వామ పక్షలకు ,దేశ రాజకీయాలకు తీరని లోటు…..సిపిఎం
సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి మృతి వామపక్షాలకి,అదే విధంగా దేశంలోని అభ్యుదయ లౌకిక, ప్రత్యామ్నాయా రాజకీయాలకు తీరనిలోటని సిపిఎం పార్టీ జిల్లా నాయకులు బి. వీరశేఖర్ పార్టీ మండల కమిటీ సభ్యులు యూసుఫ్ భాష లు పేర్కొన్నారు.
సీతారం ఏచూరి గారి మృతి నేపథ్యంలో మండల కేంద్రం దేవనకొండలో ఆయనకు ఆ పార్టీ శ్రేణులు ఘన నివాళులర్పించాయి ఈ సందర్భంగా ఆ పార్టీ మండల నాయకులు అశోక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ చదువులో గోల్డ్ మెడలిస్ట్ అయిన ఏచూరి జేఎన్టీయూ ఢిల్లీ కేంద్రంగా వామపక్ష రాజకీయాల వైపు ఆకర్షితులయ్యారని, భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) లో చేరి అఖిల భారత అధ్యక్షులు పనిచేశారని తర్వాత జరిగిన పరిణామాలలో ఎమర్జెన్సీ వ్యతిరేకంగా నిలబడ్డారని జైలుకెల్లారని పేర్కొన్నారు.
నిరంతరం ప్రజల పక్షాన, కార్మికులు, కష్టజీవుల పక్షాన నిలబడ్డారని , అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ సమస్యలపై విశేష అవగాహనతో ఆయా దేశాలతో సత్సంబంధాలు నేర్పడంలో క్రియాశీలక పాత్ర పోషించే వారిని ఈ నేపద్యంలోనే భారత ప్రభుత్వం తరఫున నేపాల్ సంక్షోభాన్ని విజయవంతంగా పరిష్కరించాలని పేర్కొన్నారు.
అభ్యుదయ ,లౌకిక ప్రత్యామ్నాయ రాజకీయాలలో మొదటి తరం నాయకుల అడుగుజాడల్లో నడుస్తూ నేటికీ విశేష పోరాటాలు చేశారని దేశంలో అన్ని రాజకీయ పార్టీ లను ఒక వేదిక పైకి తీసుకురావడంలో విజయవంతం మైన పాత్ర నిర్వహించారని పేర్కొన్నారు ఏచూరి మరణం కమ్యూనిస్టు ఉద్యమానికి కాకుండా దేశ రాజకీయాలకు లోటని పేర్కొన్నారు.
మూడుసార్లు రాజ్యసభ సభ్యునిగా ఉత్తమ పార్లమెంట్ సభ్యుడిగా , అత్యుత్తమ రాజకీయవేత్తగా దేశానికి విశేష సేవ అందించాలని ఆయన లేని లోటు తీర్చలేనిదని భవిష్యత్తులో శ్రామిక వర్గ పోరాటాలే ఆయనకు ఘన నివాళి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం మరియు ప్రజాసంఘాల నాయకులు పాండు, వెంకటేష్, కాంతయ్య, రవి, రాముడు, రంగన్న ,తదితరులు పాల్గొన్నారు.
-
Andhrapradesh2 years ago
పాలస్తీనా పై ఇజ్రాయిల్ సాగిస్తున్న దురాక్రమణ దాడులను ఖండించండి!!
-
Andhrapradesh2 years ago
ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట భధ్రత … 1,500 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు. కర్నూలు జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్ ఐపియస్.
-
Andhrapradesh2 years ago
అసహనం లో SBI కస్టమర్స్.. నిలిచిన UPI సేవలు.
-
Andhrapradesh9 months ago
పెద్దహ్యట గ్రామంలో ఆదికవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు..
-
Andhrapradesh9 months ago
ఆలూరు నియోజకవర్గ అభివృద్ధికి… సహాయ సహకారాలు అందించండి.
-
Andhrapradesh2 years ago
సాంప్రదాయాన్ని పాటిస్తూ ,ఆచార వ్యవహారాలు కాపాడుకుందాం…
-
Andhrapradesh1 year ago
మండలంలోని సాగునీటి సమస్యలపై ప్రధాన రాజకీయ పార్టీలు తమ వైఖరి వెల్లడించాలి….సీపీఎం
-
Andhrapradesh1 year ago
ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించుకుందాం.